July 28, 2026
Praja Telangana
తెలంగాణ

అక్రమ పశువుల రవాణాపై పోలీసుల కఠిన నిఘా: డీసీపీ ఏ. భాస్కర్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. మంచిర్యాలలో గోరక్షక్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.పశువుల రవాణాకు వెటర్నరీ డాక్టర్ ధ్రువపత్రం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. గోరక్షక్ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా చర్యలు తప్పవన్నారు.
జిల్లావ్యాప్తంగా 7 శాశ్వత చెక్‌పోస్టులు, 15 ఆకస్మిక చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే డయల్-100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Related posts

క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కంచుకోటగా మారింది

వడ్డెర కాలనీలో పైప్‌లైన్ పనులపై ఆకస్మిక తనిఖీ: మేయర్ దర్ని మధుకర్

Chief Editor: Satish Kumar

*రామకృష్ణాపూర్‌లో రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచన*

Share this