September 10, 2026
Praja Telangana
తెలంగాణ

వడ్డెర కాలనీలో పైప్‌లైన్ పనులపై ఆకస్మిక తనిఖీ: మేయర్ దర్ని మధుకర్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ, 51వ డివిజన్లలో ఉన్న వడ్డెర కాలనీలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, పైప్‌లైన్ మార్పిడి పనులను మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించారు. రోడ్డు మధ్యలో ఉన్న పాత పైప్‌లైన్‌ను తొలగించి రోడ్డు పక్కన కొత్త పైప్‌లైన్ నిర్మాణ పనులు మున్సిపల్ పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.ఈ పనుల్లో జాప్యం కారణంగా స్థానిక ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో మేయర్ క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులతో పాటు పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన నీటి సరఫరా,రవాణా సౌకర్యాలు పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు శ్రీమతి నీలి స్వప్న శ్రీనివాస్,గంగవరపు వెంకటేశ్వర్లు,పబ్లిక్ హెల్త్ డీఈ మధుకర్,మున్సిపల్ డీఈ రాజేందర్,కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు ఇతరులు పాల్గొన్నారు.

Related posts

లక్ష్మీ గణపతి ఆలయ షెడ్ల నిర్మాణానికి రూ.2.55 లక్షల విరాళం: రాచకొండ వెంకటేశ్వరరావు (బుజ్జన్న)

మోడీ క్యాంటీన్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ

*సింగరేణి ఐరన్ పైపుల అక్రమ రవాణా గుట్టురట్టు.. సివిల్ సూపర్వైజర్, స్క్రాప్ వ్యాపారి సహా ఆరుగురు అరెస్ట్*

Share this