September 11, 2026
Praja Telangana
తెలంగాణ

డెంగ్యూపై నిర్లక్ష్యం ప్రాణాంతకం.. అప్రమత్తతే రక్షణ : కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మే 15 : జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డెంగ్యూ నివారణపై అవగాహన పోస్టర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభ సమయంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి వ్యాధుల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, వారానికి ఒకసారి డ్రైడే పాటించాలని తెలిపారు.జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.జిల్లాలో రాపిడ్ టెస్టులు,ఎలిసా పరీక్షలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్.అనిత, రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ రవికిరణ్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

*అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. రూ.20 లక్షల వరకు ఉపకార వేతనం: జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్*

అకాల వర్షాల బీభత్సం — కళ్లముందే నేలమట్టమైన పంటలు, ఆందోళనలో రైతులు

*మంచిర్యాల కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ ఆందోళన.. అవినీతి ఆరోపణలపై విచారణకు డిమాండ్*

Chief Editor: Satish Kumar
Share this