మంచిర్యాల జిల్లా నస్పూర్లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ప్రయాణికులతో మర్యాదపూర్వక ప్రవర్తన, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. మహిళల వేధింపులు, సైబర్ మోసాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, ఆటో యూనియన్ ప్రతినిధులు మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

