ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నృత్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. నృత్య కళ ప్రాముఖ్యతను గుర్తుచేసే ఈ రోజు ప్రత్యేక స్థానం కలిగి ఉంది. శరీర కదలికల ద్వారా భావాలను వ్యక్తపరచే నృత్యం, వినోదం మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబంగా నిలుస్తోంది.భరతనాట్యం, కూచిపూడి,కథక్,ఒడిస్సీ వంటి శాస్త్రీయ నృత్యాలు భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.ముఖ్యంగా కూచిపూడి నృత్యం తెలుగు రాష్ట్రాలకు గౌరవం తీసుకువచ్చింది.నృత్యం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలు, కళా సంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ నృత్యంపై అవగాహన పెంచుతున్నాయి. నృత్యం ద్వారా భావ వ్యక్తీకరణతో పాటు సంస్కృతి పరిరక్షణ కూడా సాధ్యమవుతోంది.

