మంచిర్యాల జిల్లా మందమర్రి సీఐ తెలిపిన వివరాల ప్రకారం సింగరేణి ఏరియా స్టోర్లో బ్యాటరీలు దొంగతనానికి గురైన ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి కేసును చేధించారు. ఈ నెల 25న అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు,నార్లాపూర్ సమీప హైవేపై వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించిన ఆటోను అడ్డుకుని తనిఖీ చేయగా 25 బ్యాటరీలు లభించాయి.ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులను విచారించగా ఈ నెల 20న అర్ధరాత్రి సమయంలో సింగరేణి స్టోర్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులు ధనకుంట్ల మునియప్ప, జన్నే నరేంద్ర, గాజుల శివప్రసాద్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసును చేధించిన ఎస్ఐ జి.నరేష్,సిబ్బందిని సీఐ అభినందించారు.

