July 28, 2026
Praja Telangana
తెలంగాణ

జన్నారం బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం

జన్నారం,మే 22:జన్నారం బస్టాండ్ పరిసర ప్రాంతంలో గురువారం ఒక గుర్తుతెలియని పురుష మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న జన్నారం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సుమారు 30 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తించినట్లయితే లేదా సంబంధిత సమాచారం తెలిసినట్లయితే వెంటనే జన్నారం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.

Related posts

వైద్యులు సూచించిన విధంగా మాత్రమే మందులు విక్రయించాలి

*సికిల్ సెల్ వ్యాధిపై అవగాహనతోనే నివారణ : డాక్టర్ సుధాకర్ నాయక్*

మోడీ క్యాంటీన్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ

Share this