July 28, 2026
Praja Telangana
తెలంగాణ

నకిలీ పత్తి విత్తనాల ముఠాపై పోలీసుల దాడి.. ఇద్దరు అరెస్ట్

తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి భారీగా విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా,డీసీపీ ఏ.భాస్కర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.పెరికపల్లి గ్రామానికి చెందిన కొండపల్లి రాజేశం, నెన్నెల గ్రామానికి చెందిన అట్కాపురం సురేష్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా మొత్తం 55 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. వీటి విలువ సుమారు రూ.1.32 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.నిందితులు తక్కువ ధరకు విత్తనాలు తెచ్చుకుని రైతులను మోసగించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.రైతులు అనుమతి పొందిన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని పోలీసులు,వ్యవసాయ అధికారులు సూచించారు.

Related posts

*వ్యాపార భద్రతకు సీసీ కెమెరాలే కీలకం: బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్*

*జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ నరేందర్ రాథోడ్ బాధ్యతల స్వీకరణ*

ఫిల్టర్ బెడ్ ఏరియా మందమరిలో గుడుంబా పట్టివేత

Share this