సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మంద మకరందు గురువారం మంచిర్యాల జిల్లాలో పలు అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లాలోని నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ను కలిసి మొక్కను అందజేశారు.అనంతరం మంచిర్యాల పట్టణంలోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఎ.భాస్కర్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.ఈ సందర్భంగా అధికారులు మంద మకరందుకు శుభాకాంక్షలు తెలిపారు.

