June 2, 2026
Praja Telangana
తెలంగాణ

రాష్ట్ర ఆదాయ వనరుల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ దృష్టి __సంక్షేమ,అభివృద్ధికి నిధుల భరోసాపై చర్చ

డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ‘మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.రాష్ట్ర ఆదాయ వనరుల పెంపు, పెండింగ్ ఆర్థిక అంశాలపై చర్చించారు.ఎక్సైజ్, స్టాంపులు & రిజిస్ట్రేషన్లు,మైనింగ్ శాఖల ఆదాయంపై సమీక్ష జరిపి, ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చే మార్గాలపై దృష్టి సారించారు.వనరుల వినియోగంలో పారదర్శకత పాటించాలని,సంక్షేమం–అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,డి.శ్రీధర్ బాబు,జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిజెపి తోనే దేశాభివృద్ధి సాధ్యం..47వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థి వెరబెల్లి రవీందర్ రావు

హనుమకొండలో దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ముగిసిన మంచిర్యాల కార్పొరేషన్ల ప్రమాణ ప్రమాణ స్వీకారాల కార్యక్రమం

Share this