డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ‘మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.రాష్ట్ర ఆదాయ వనరుల పెంపు, పెండింగ్ ఆర్థిక అంశాలపై చర్చించారు.ఎక్సైజ్, స్టాంపులు & రిజిస్ట్రేషన్లు,మైనింగ్ శాఖల ఆదాయంపై సమీక్ష జరిపి, ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చే మార్గాలపై దృష్టి సారించారు.వనరుల వినియోగంలో పారదర్శకత పాటించాలని,సంక్షేమం–అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,డి.శ్రీధర్ బాబు,జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

