July 28, 2026
Praja Telangana
తెలంగాణ

తీవ్ర ఎండల ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏప్రిల్–మే నెలల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని తెలిపారు. అధిక వేడి కారణంగా డీహైడ్రేషన్, సన్‌స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.ప్రజలు ఎక్కువగా నీరు,మజ్జిగ,నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఎండలో వాహనాల్లో గ్యాస్ పదార్థాలు,లైటర్లు వంటి ప్రమాదకర వస్తువులు ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు.అలాగే అవసరం లేని ప్రయాణాలు నివారించి,ఇంట్లో చల్లని వాతావరణం కల్పించుకోవాలని సూచించారు.ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని,ప్రజలు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అవగాహన పెంచుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Related posts

డెంగ్యూపై నిర్లక్ష్యం ప్రాణాంతకం.. అప్రమత్తతే రక్షణ : కలెక్టర్ కుమార్ దీపక్

*మంచిర్యాల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ.. ప్రధాన కూడళ్లను పరిశీలించిన డీసీపీ భాస్కర్*

అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ…. రెండు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో 600 కోట్ల అభివృద్ధి

Share this