మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మేయర్ శ్రీ దర్నీ మధుకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని, సాధ్యమైనంత వరకు రోగులకు అక్కడే ప్రాథమిక చికిత్స అందించాలని సిబ్బందికి సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోగులను పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీ కార్యక్రమంలో మేయర్తో పాటు వైద్యులు నక్క వెంకటేష్,ఆసుపత్రి సిబ్బంది,స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
previous post

