July 28, 2026
Praja Telangana
తెలంగాణ

డెంగ్యూ నివారణకు ప్రజల సహకారం అవసరం: మేయర్ ధరణి మధుకర్_ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.అనిత

మంచిర్యాల, మే 16: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంచిర్యాల అరుణక్కనగర్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్. అనిత, మేయర్ ధరిని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్ వేల్పుల రవీందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు.అనంతరం కీటక జనిత వ్యాధుల నివారణలో సేవలు అందించిన వైద్య సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్,వైద్య అధికారులు,ఆశా కార్యకర్తలు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

*ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ.. పరిష్కారానికి సీపీ ఆదేశాలు *

హనుమకొండలో దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

*జల్ సంచయ్ జన భాగీదారి–3.0లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి: క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ*

Share this