July 28, 2026
Praja Telangana
తెలంగాణ

ఏటీఎంలో మర్చిపోయిన నగదు – మానవత్వంతో పోలీసులకు అప్పగింత

మంచిర్యాల పట్టణ టౌన్ సిఐ (ఎస్ హెచ్ ఓ)

మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంకు ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తి రూ.11,000 నగదు,ఏటీఎం కార్డు మర్చిపోయిన ఘటన చోటుచేసుకుంది.అనంతరం ఏటీఎంలోకి వెళ్లిన మరో వ్యక్తి వాటిని గమనించి వెంటనే 100 డయల్‌కు సమాచారం ఇవ్వడం జరిగింది.సమాచారం అందుకున్న వెంటనే బ్లూ కోర్టు కానిస్టేబుళ్లు సత్యనారాయణ రాజు ఘటన స్థలానికి చేరుకుని నగదు,కార్డును స్వాధీనం చేసుకున్నారు.వాటిని అప్పగించిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు నమోదు చేశారు.ఈ సందర్భంగా సీఐ నిజాయితీగా వ్యవహరించిన వ్యక్తిని ప్రశంసించారు.అలాగే ప్రతి పౌరుడు నిజాయితీగా తన కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు. అదేవిధంగా ఏటీఎంలో నగదు,కార్డు మర్చిపోయిన వారిని మంచిర్యాల పోలీస్ స్టేషన్‌ కు వచ్చి సంప్రదించాలని కోరారు.

Related posts

*జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ నరేందర్ రాథోడ్ బాధ్యతల స్వీకరణ*

నీట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు__సిపి అంబర్ కిషోర్ ఝూ

*గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలపై డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ*

Share this