June 3, 2026
Praja Telangana
తెలంగాణ

ఏటీఎంలో మర్చిపోయిన నగదు – మానవత్వంతో పోలీసులకు అప్పగింత

మంచిర్యాల పట్టణ టౌన్ సిఐ (ఎస్ హెచ్ ఓ)

మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంకు ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తి రూ.11,000 నగదు,ఏటీఎం కార్డు మర్చిపోయిన ఘటన చోటుచేసుకుంది.అనంతరం ఏటీఎంలోకి వెళ్లిన మరో వ్యక్తి వాటిని గమనించి వెంటనే 100 డయల్‌కు సమాచారం ఇవ్వడం జరిగింది.సమాచారం అందుకున్న వెంటనే బ్లూ కోర్టు కానిస్టేబుళ్లు సత్యనారాయణ రాజు ఘటన స్థలానికి చేరుకుని నగదు,కార్డును స్వాధీనం చేసుకున్నారు.వాటిని అప్పగించిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు నమోదు చేశారు.ఈ సందర్భంగా సీఐ నిజాయితీగా వ్యవహరించిన వ్యక్తిని ప్రశంసించారు.అలాగే ప్రతి పౌరుడు నిజాయితీగా తన కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు. అదేవిధంగా ఏటీఎంలో నగదు,కార్డు మర్చిపోయిన వారిని మంచిర్యాల పోలీస్ స్టేషన్‌ కు వచ్చి సంప్రదించాలని కోరారు.

Related posts

కుల గణన సాధించడంలో కీలక పాత్ర పోషించిన బీసీ ఉద్యమకారుడు గుమ్ముల శ్రీనివాస్ కి సన్మానం

చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం__ ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు నమోదు తప్పనిసరి : మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్

తాండూర్, అండర్ బ్రిడ్జిలో వాటర్ జామై ఇబ్బంది పడుతున్న జనం

Share this