September 12, 2026
Praja Telangana
తెలంగాణ

ఏటీఎంలో మర్చిపోయిన నగదు – మానవత్వంతో పోలీసులకు అప్పగింత

మంచిర్యాల పట్టణ టౌన్ సిఐ (ఎస్ హెచ్ ఓ)

మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంకు ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తి రూ.11,000 నగదు,ఏటీఎం కార్డు మర్చిపోయిన ఘటన చోటుచేసుకుంది.అనంతరం ఏటీఎంలోకి వెళ్లిన మరో వ్యక్తి వాటిని గమనించి వెంటనే 100 డయల్‌కు సమాచారం ఇవ్వడం జరిగింది.సమాచారం అందుకున్న వెంటనే బ్లూ కోర్టు కానిస్టేబుళ్లు సత్యనారాయణ రాజు ఘటన స్థలానికి చేరుకుని నగదు,కార్డును స్వాధీనం చేసుకున్నారు.వాటిని అప్పగించిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు నమోదు చేశారు.ఈ సందర్భంగా సీఐ నిజాయితీగా వ్యవహరించిన వ్యక్తిని ప్రశంసించారు.అలాగే ప్రతి పౌరుడు నిజాయితీగా తన కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు. అదేవిధంగా ఏటీఎంలో నగదు,కార్డు మర్చిపోయిన వారిని మంచిర్యాల పోలీస్ స్టేషన్‌ కు వచ్చి సంప్రదించాలని కోరారు.

Related posts

*అధిక ధరల పుస్తకాల విక్రయాలపై విద్యాశాఖ కొరడా.. ట్రినిటీ బుక్ స్టాల్ వ్యవహారంలో అనుమానాలు, జై శ్రీ బట్టల షాప్ సీజ్.. అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశాలు: విద్యాశాఖ పిడి లలిత*

Chief Editor: Satish Kumar

వడదెబ్బ నివారణతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.అనిత

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

Share this