September 11, 2026
Praja Telangana
తెలంగాణ

శాంతిగని గని‌లో ఏఐటీయూసీ పరిశీలన

శాంతిగని గని‌లో ఏఐటీయూసీ పరిశీలన

శాంతిగని గని‌లో ఇరవై ఐదు రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన నేపథ్యంలో, ఏఐటీయూసీ బెల్లంపల్లి శాఖ కార్యదర్శి దాగం మల్లేష్ నాయకత్వంలో గని‌లో లోతుగా పరిశీలన నిర్వహించారు. ఉత్పత్తి నిలిచిపోవడానికి కారణాలు, గని భద్రతా పరిస్థితులు, ఉత్పత్తి స్థితిని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. బొగ్గు ఉత్పత్తిని త్వరగా పునఃప్రారంభించేలా కార్మికులు, అధికారులకు సూచనలు చేశారు.
ఈ పరిశీలనలో శాంతిగని గని ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి, బెల్లంపల్లి శాఖ ఉపాధ్యక్షుడు బియ్యాల వెంకటస్వామి, కాశీపేట రెండవ గని కార్యదర్శి శ్రీనివాస్, శాఖ నిర్వహణ కార్యదర్శి మంతెన రమేష్, వర్క్‌మెన్ పరిశీలకుడు పొట్ల రాయలింగు, గని కమిటీ సభ్యుడు దాడి రమేష్ పాల్గొన్నారు.

Related posts

*భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి రికార్డుల పరిశీలనతో పారదర్శకంగా భూ సర్వే చేపట్టాలి: కలెక్టర్ కుమార్ దీపక్*

జబ్బలు సరిసిందెవరు …బొమ్మ గడియారాలు ఇచ్చింది ఎవరు…!కల్లూరు సభలో స్థానిక నేతలపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

*డిగ్రీ సీటు జూలై1వ తేదీలోపు కన్ఫామ్ చేసుకోగలరు*

Chief Editor: Satish Kumar
Share this