June 3, 2026
Praja Telangana
తెలంగాణ

“తెలంగాణలో రెడ్ అలర్ట్__7 జిల్లాల్లో ఎండల తీవ్రత

తెలంగాణ,మే23:తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, సిరిసిల్ల, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.ఎండల ప్రభావంతో వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, కూలీలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వడదెబ్బ, నీరసం, తలనొప్పి, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.ప్రజలు రోజుకు ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు తీసుకోవాలి. తేలికపాటి పత్తి దుస్తులు ధరించడం, బయటకు వెళ్లేటప్పుడు గొడుగు,తల కప్పుకునే వస్త్రం ఉపయోగించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులను వాహనాల్లో ఒంటరిగా వదిలేయకూడదని, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నారు.వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, కాలుష్యం కారణంగా ప్రతి ఏడాది ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించగలమని వారు అభిప్రాయపడుతున్నారు.ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం ప్రభుత్వం జారీ చేస్తున్న సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. అప్రమత్తతే ప్రాణ రక్షణ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.

Related posts

లక్ష్మీ గణపతి ఆలయ షెడ్ల నిర్మాణానికి రూ.2.55 లక్షల విరాళం: రాచకొండ వెంకటేశ్వరరావు (బుజ్జన్న)

వడదెబ్బ నివారణతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.అనిత

Share this