July 28, 2026
Praja Telangana
తెలంగాణ

క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి_ జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య

క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఏప్రిల్ 4, 2026న జరగనున్న చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య ఆదేశించారు. ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు భద్రత, వేదిక, కూర్చునే ఏర్పాట్లు, మైక్ వ్యవస్థ, రికార్డు నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే బారికేడింగ్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, శానిటేషన్ వంటి సదుపాయాలు ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Related posts

*ఎసన్వాయి గ్రామంలో గుడుంబా స్థావరాలపై పోలీసు–ఎక్సైజ్ సంయుక్త ఉక్కుపాదం*

*ప్రపంచ జనాభా దినోత్సవం: “చిన్న కుటుంబం – చింతలేని కుటుంబం” నినాదంతో మంచిర్యాలలో అవగాహన ర్యాలీ*

మంచిర్యాల విద్యాభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన డా. రవికాంతరావుకు ఘన సన్మానం: గుండేటి యోగేశ్వర్

Share this