July 27, 2026
Praja Telangana
తెలంగాణ

అరుదైన “మే పుష్పం”తో ఆకట్టుకుంటున్న గుండేటి యోగేశ్వర్ ప్రకృతి మిత్ర నిలయం

మంచిర్యాల, మే 16 :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ కాలనీలో గల “ప్రకృతి మిత్ర” నిలయంలో అరుదైన “మే పుష్పం” ఒకే మొక్కకు రెండు పువ్వులు వికసించి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది.ఈ సందర్భంగా పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ “స్క్యాడోక్సస్ మల్టీఫ్లోరస్” అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పుష్పాన్ని “ఫుట్‌బాల్ లిల్లీ”,“బ్లడ్ లిల్లీ”,“మే ఫ్లవర్” అని పిలుస్తారని తెలిపారు.వేసవి కాలంలో మాత్రమే కొద్ది రోజుల పాటు ఈ పుష్పం వికసించడం ప్రత్యేకత అని చెప్పారు.తక్కువ నీటితోనే ఎండల్లో వికసించే ఈ పుష్పం ఆకర్షణీయ రూపంతో పాటు సున్నితమైన సువాసన వెదజల్లుతుందని పేర్కొన్నారు.అరుదైన మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచడం వలన మానసిక ఆనందం,ప్రశాంతత లభిస్తాయని తెలిపారు.ఈ అరుదైన పుష్పాన్ని చూసేందుకు స్థానికులు,ప్రకృతి ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు.

Related posts

“మేరా భారత్ మహాన్” థీమ్‌తో ఈనెల 24న వివిధ పోటీలు

Chief Editor: Satish Kumar

హన్మకొండలో RTI బోర్డుల ఏర్పాటు త్వరలో – డి.ఆర్.ఓ హామీ

*పొగాకు:నెమ్మదిగా చంపే నిశ్శబ్ద శత్రువు__ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (మే 31) ప్రత్యేక కథనం*

Share this