నీట్-2026 ప్రవేశ పరీక్షల సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది.పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.మంచిర్యాల జోన్లోని నాలుగు కేంద్రాల్లో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుండగా,కేంద్రాల పరిసరాల్లో గుమికూడడం,ర్యాలీలు,సమావేశాలు నిషేధించారు.అలాగే 500 మీటర్ల పరిధిలోని జిరాక్స్ కేంద్రాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

