ఫీజు నియంత్రణ బిల్లు వెంటనే చట్టంగా చేయాలి
తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులతో తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి అరుణ్ తెలిపారు. పుస్తకాలు, యూనిఫామ్లు, స్పెషల్ క్లాసుల పేర్లతో అదనపు వసూళ్లు జరుగుతున్నాయని అన్నారు. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం సిద్ధం చేసిన బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గించేందుకు ఆ బిల్లును వెంటనే చట్టంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

