September 11, 2026
Praja Telangana
తెలంగాణ

47 వ డివిజన్ లో గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు

మంచిర్యాల,47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రవీందర్ రావు ప్రచారం

మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి వెర్రబెల్లి రవీందర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని 47వ డివిజన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి బాటలో ఉంచడమే దయంగా పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి,ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థి కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి పార్టీ కన్వీనర్ రెడ్డిమల్ల అశోక్, కోకన్వీనర్లు భరత్,స్వాతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకో అవకాశం ఇవ్వండి: రాజాసింగ్

*జైపూర్ ఎస్‌టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో కమ్యూనిటీ కాంటాక్ట్.. 41 వాహనాలు సీజ్*

డాక్టర్ సుతి గోలి గారికి బహుజన్ సమాజ్ పార్టీ ఘన సన్మానం

Share this