పెద్దపల్లి, జూలై 14:సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఆర్జీ-1 పరిధిలోని ఓసీపీ-5 వద్ద జరిగిన ఈ సందర్భంగా కమిషనర్ మంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సింగరేణి భరోసా యాత్ర సందర్భంగా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.

