క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఏప్రిల్ 4, 2026న జరగనున్న చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పరోక్ష ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య ఆదేశించారు. ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు భద్రత, వేదిక, కూర్చునే ఏర్పాట్లు, మైక్ వ్యవస్థ, రికార్డు నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే బారికేడింగ్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, శానిటేషన్ వంటి సదుపాయాలు ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

