September 11, 2026
Praja Telangana
తెలంగాణ

సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాత్రికేయుల సమావేశం

ఈరోజు మంచిర్యాల కేంద్రంలోని నార్తిన్ హోటల్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేష్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా డీసీసీ పదవి కొరకు మంచిర్యాల జిల్లా నుండి 28 మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.. ఈ అప్లికేషన్స్ ఇచ్చిన వారితో నేను ముఖాముఖి మాట్లాడడం జరిగిందని చెప్పారు, అనంతరం ఈ అప్లికేషనులను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే , అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ ,ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ గాతో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో సమావేశం చేసిన 15రోజుల తరువాత మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు పదవి ఖరారు చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో పీసీసీ అబ్సర్వర్ అడువాల జ్యోతి, పీసీసీ అబ్సర్వర్ డా, పులి అనిల్ కుమార్ , శ్రీనివాస్ పీసీసీ కో ఆర్డినేటర్, జిల్లా, బ్లాక్, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Related posts

జన్నారం బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం

వడదెబ్బ నివారణతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.అనిత

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: నెన్నెల ఎస్ఐ

Share this