September 11, 2026
Praja Telangana
తెలంగాణ

కార్మిక శాఖ మంత్రి ఏఐటియుసి మందమర్రి జీఎం ఆఫీస్ పిట్ కమిటీ చిరు సత్కారం

కార్మిక శాఖ మంత్రి ఏఐటియుసి మందమర్రి జీఎం ఆఫీస్ పిట్ కమిటీ చిరు సత్కారం

మమందమర్రి:కారుణ్య నియామక పత్రాల అందజేత కార్యక్రమం సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వివేకు వెంకటస్వామి మందమర్రి జీఎం ఆఫీస్‌కి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక మంత్రివర్యులు కారుణ్య నియామకాలుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ,మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ , బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్ పాల్గొన్నారు.మొట్టమొదటిసారి కార్మిక శాఖ మంత్రి జీఎం ఆఫీస్‌ను సందర్శించిన సందర్భంగా పిట్ కమిటీ వారు మంత్రివర్యులను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సత్కార కార్యక్రమంలో జీఎం ఆఫీస్ స్ట్రక్చర్ కమిటీ సభ్యులు సి.వి. రమణ, పిట్ కమిటీ సభ్యులు బింగి సత్యనారాయణ, అనంతలక్ష్మి, తోకల జ్యోతి, రమ్యసుధ, సుమలత, జలధి, లక్ష్మణ్, లక్కాకుల శ్రీనివాస్, ఇనుముల రాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*ప్రభుత్వ బియ్యం దారి మళ్లింపు.. రైస్‌మిల్లర్‌పై పీడీ యాక్ట్*

*మంత్రాలు చేస్తున్నారనే మూఢనమ్మకంతో మహిళ హత్య.. ఇద్దరు నిందితుల అరెస్టు*

మల్ల్యాల మండలంలో శ్రీ స్వామి వారి జాతర ఉత్సవాలు ప్రారంభం

Share this