బజార్ హత్నూర్లో “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభ
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభ ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, సీఎం రేవంత్ రెడ్డికి గూడెం సత్యనారాయణ స్వామి లడ్డు ప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు,అధికారులు, చైర్మన్లు,కలెక్టర్లు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

