మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాల వేలం
మంచిర్యాల పట్టణ పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ ఎక్సైజ్ కేసులకు సంబంధించి పట్టుబడిన ద్విచక్ర వాహనాలను ప్రభుత్వ నిబంధనల మేరకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.ఈ వేలం కార్యక్రమం తేదీ 25-02-2026 న ఉదయం 10:00 గంటలకు మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు ఎక్సైజ్ స్టేషన్ను సంప్రదించి, వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు తెలుసుకొని పాల్గొనవచ్చని తెలిపారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ వేలాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ఇట్లు
సప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్
మంచిర్యాల

