July 29, 2026
Praja Telangana
తెలంగాణ

రేషన్ కట్ ఉండదు ఈ-కేవైసీకి గడువు లేదు

రేషన్ కట్ ఉండదు ఈ-కేవైసీకి గడువు లేదు

బియ్యం పంపిణీ నిలిపివేత వార్తల్లో నిజం లేదు
సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని స్పష్టంతెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల్లో ఇటీవల కొనసాగుతున్న అయోమయానికి పౌరసరఫరాల శాఖ తెరదించింది. ఈ నెల 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నిలిపివేస్తారన్న వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర స్పందిస్తూ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రేషన్ కట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదని, బియ్యం పంపిణీని నిలిపివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన తెలిపారు.
ఈ-కేవైసీ అంటే ఏమిటి?
ఈ-కేవైసీ ప్రక్రియ అనేది రేషన్ కార్డులో నమోదైన లబ్ధిదారుల వివరాలను ధృవీకరించేందుకు చేపట్టే సాధారణ ప్రక్రియగా అధికారులు వివరించారు. కార్డులో పేరు ఉన్న ప్రతి వ్యక్తి కనీసం ఒక్కసారైనా రేషన్ దుకాణానికి వెళ్లి వేలిముద్రలు లేదా కనుపాప గుర్తులను నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి తుది గడువును నిర్ణయించలేదని కమిషనర్ స్పష్టం చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నదే లక్ష్యమని, ఎవరినీ రేషన్ నుంచి దూరం చేసే ఉద్దేశం లేదని తెలిపారు.భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా
రేషన్ పంపిణీలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఈ-కేవైసీ పూర్తి చేయడం మంచిదని ప్రభుత్వం సూచించింది. అనర్హుల పేర్లను తొలగించడం, అలాగే మరణించిన వారి వివరాలను గుర్తించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
లబ్ధిదారులు ఆందోళనతో రేషన్ దుకాణాల వద్ద గుమికూడాల్సిన అవసరం లేదని, తమకు వీలైన సమయంలో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. అధికారిక ప్రకటనతో క్షేత్రస్థాయిలో నెలకొన్న అయోమయం తొలగినట్లు అధికారులు పేర్కొన్నారు.

Related posts

*పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి ‘ప్రకృతిమిత్ర’ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తాం : సింగరేణి జీఎం శ్రీనివాస్*

బ్యాంకు ల ఆధ్వర్యంలో షేడ్ వేయండి. పార్కింగ్ కల్పించండీ.

Chief Editor: Satish Kumar

ఎస్సి ఎస్టీ మానిటరింగ్ కమిటీలో ఎరుకాల కులస్తులకు అవకాశం కల్పించాలి*

Share this