బట్వాన్పల్లిలో టిడిపి అభ్యర్థిగా రామటంకి హరిబాబు బరిలో
గ్రామాభివృద్ధే లక్ష్యం—మౌలిక సదుపాయాల ప్రాధాన్య టి ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు టి.మణిరాం సింగ్
బెల్లంపల్లి రూరల్ మండలం బట్వాన్పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి టిడిపి తరఫున రామటంకి హరిబాబు బరిలో దిగారు. యువత రాజకీయాల్లోకి రావాలని టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. మణిరామ్ సింగ్ పిలుపునిచ్చారు.
గ్రామాభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుని విద్య, వైద్యం, రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ వంటి రంగాల్లో మెరుగులు చేస్తానని హరిబాబు తెలిపారు. రైతుల ధాన్యం వారి వద్దకే కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేస్తానన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.

