Praja Telangana
తెలంగాణ

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన భీమారం మండలం యువకులు

మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో మత్స్యకారుల సంఘం కమ్యూనిటీ భవనంలో దెబ్బేటి శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం జరిగింది. వారికి జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. పరాయి పార్టీ జెండాలను పక్కనబెట్టి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను గ్రామస్థాయిలో బలోపేతం చేసి రానున్న రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలో వచ్చేంతవరకు కృషి చేస్తామని తెలిపారు. మహేష్ వర్మ మాట్లాడుతూ.. ప్రజలు చైతన్యం అయ్యారని, అగ్రవర్ణాల రాజకీయ పార్టీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తీన్మార్ మల్లన్న గారితోనే మన రాజ్యాధికారం వస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. వచ్చేది బీసీల రాజ్యమే అని, 2028లో బీసీ ముఖ్యమంత్రి అది తీన్మార్ మల్లన్న గారే అని స్పష్టం చేశారు.

Related posts

కార్మిక శాఖ మంత్రి ఏఐటియుసి మందమర్రి జీఎం ఆఫీస్ పిట్ కమిటీ చిరు సత్కారం

జూలై 9 దేశవ్యాప్త సమ్మెకు జే ఏ సి పిలుపు

Chief Editor: Satish Kumar

ఆర్&ఆర్ సెంటర్ స్థలాల పంపిణీ

Share this