హాజీపూర్: విధులపై బాధ్యతగా వ్యవహరించాలి
Jun 26, 2025,
హాజీపూర్: విధులపై బాధ్యతగా వ్యవహరించాలి
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు విధులపై బాధ్యతగా వ్యవహరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ ధ్రువపత్రాల కోసం అందిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి గడువులోగా జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.