June 13, 2026
Praja Telangana
తెలంగాణ

ఘనంగా కుంకుమ పూజలు తరలి వచ్చిన మహిళలు

ఘనంగా కుంకుమ పూజలు
తరలి వచ్చిన మహిళలు

మంచిర్యాల
జిల్లాకేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించేందుకు భక్తులు, మహిళలు తరలి వచ్చారు.. వంద ఫీట్ల రోడ్డు వద్ధ అంజనీ పుత్ర సంస్థ కార్యాలయ ఆవరణ లో కొలువైన లంబోదరుని వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి, ఒకరికొకరు వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. గణనాథుని వద్ద మహిళలు కోలాటాలు ఆడి భక్తులను అలరించారు. ఈ సందర్భంగా అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు వినాయక చవితి పండుగ అద్దం పడుతుందని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలు ప్రేమను రాగాలతో కలిసి జరుపుకునే పండుగ వినాయక చవితి అన్నారు. అనంతరం మహిళా మణులతో 3000 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం, సంస్థ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

Related posts

*సమాజ సేవకు బలంగా రెడ్ క్రాస్ సభ్యత్వ విస్తరణ__ మంచిర్యాలలో శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమం*

Chief Editor: Satish Kumar

అడ్డా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Share this