కన్నాల్లో ప్రభుత్వ భూమిని సాధీనం చేసి పేదలకు ఇవ్వాలి
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములను నిరుపేదలకు కేటాయించాలని మాజీ సర్పంచ్ అనిత శనివారం సబ్ కలెక్టర్ మనోజ్కు వినతిపత్రం అందజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వెనకాల ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని ఆమె తెలిపారు.
భూములను సాధీనం చేసి, నిజమైన అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తే మాత్రమే న్యాయం జరుగుతుందని అనిత పేర్కొన్నారు. బెల్లంపల్లి పరిసరాల్లో భూములపై జరుగుతున్న కబ్జాలను అధికారులు పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

